Friday, December 02, 2016

దళిత క్రైస్తవ/సిక్కుల ,/ముస్లింల/బౌద్ధుల గర్జన

అనొథెర్ ఆక్సీమోరోన్
and a political ploy by  the most corrupt politician's son  in  AP, namely
Y.S Jagan  

రాజమహేంద్రవరం, నవంబర్‌ 11 : దళిత క్రైస్తవులకు ఎస్సీ ¬దా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటలకు స్ధానిక ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్స్‌లో దళిత క్రైస్తవ గర్జన నిర్వహిస్తున్నట్లు ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌(ఎఐసిఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు జార్జి శ్రీమంతుల వెల్లడించారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జార్జి శ్రీమంతుల మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్‌లు కల్పించడం, మత స్వేచ్ఛ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళాలని కోరారు. దళితులు బౌద్ధ, సిక్కు, హిందూ మతంలోకి మారినప్పుడు మారని రిజర్వేషన్‌లు, క్రైస్తవ మతంలోకి వెళితే ఎందుకు మారతాయని ప్రశ్నించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ ¬దాకోసం ఢిల్లీ స్ధాయిలో భారీ ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈనెల 14న జరిగే దళిత క్రైస్తవ గర్జనకు ఎపిలోని 13 జిల్లాలలో పాటు తెలంగాణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హాజరవుతారన్నారు. అన్ని రాజకీయ పార్టీల వారినీ ఈ సభకు ఆహ్వానించామని, ఆయా పార్టీల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. నాయకులు బి జార్జి ఆంధోనీ మాట్లాడుతూ మత హక్కు, మత స్వేచ్ఛ ఉండాలన్నారు. దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ హరించబడుతుందన్నారు. మతం మారినా స్వాభావికంగా పుట్టిన కులం మారదని సుప్రీం కోర్టు తీర్పు కూడా ఇచ్చిందని తెలిపారు. కోలమూరు ప్రభాకరరావు మాట్లాడుతూ సిక్కులు, బౌద్దం తీసుకున్న ఎస్సీలు పోరాడి రిజర్వేషన్‌లు సాధించారని, దళిత క్రైస్తవులు ఎంతో కాలంగా న్యాయపోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి క్రిష్టియన్‌ ఫోబియా పట్టుకుందన్నారు. ఎస్సీలను హిందూ మతం తీసుకోమని ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుందన్నారు. 14న నిర్వహిస్తున్న దళిత క్రైస్తవ గర్జనకు పెద్దకుత్తున దళిత క్రైస్తవులు తరలిరావాలని పిలుపునిచ్చారు. గెడ్డం నెల్సన్‌బాబు, గుళ్ళ మార్టిన్‌ శాంతకుమార్‌, రత్న కుమార్‌లు మాట్లాడారు. విలేకరుల సమావేశంలో రెడ్డి జ్యోతికుమార్‌, తాతపూడి సుకుమార్‌, ఎమ్‌ చిట్టిబాబు, పిఎం రాజు, జాలా నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments: